ఇద్దరు పిల్లలతో ఓ వివాహిత బలవన్మరణం

ఇద్దరు పిల్లలతో ఓ వివాహిత బలవన్మరణం

సత్తుపల్లి , ముద్ర : సత్తుపల్లి తామర చెరువులో ఇద్దరు పిల్లలతో ఓ వివాహిత దూకి బల్వన్మరనానికి పాల్పడింది. చెరువులో మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించిన జాలర్లు. బందువులు, పోలీసుల తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు... మృతులను సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన పాటిబండ్ల మృదుల (40), ప్రజ్ఞాన్ (8), మహాన్ (5)గా గుర్తించారు. కుటుంబ కలహల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. భర్త ప్రసాద్ తో కలిసి వారం క్రితం హైదరాబాద్ నుండి అత్త వారి ఇల్లు సత్తుపల్లికి  మృదుల వచ్చింది. పది రోజుల క్రితం పిల్లలను అత్తవారింటికి పంపింది. నిన్న విజయవాడలో బంధువుల ఇంట్లో పంక్షన్ కు వెళ్ళి రాత్రి సత్తుపల్లి చేరుకున్న మృదులా పిల్లలు. ప్రసాద్ ఐదేళ్ల క్రితం వరకు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ హయత్ నగర్ లో భార్య, పిల్లలతో ఉంటున్నాడు.