జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: మంత్రి పువ్వాడ

జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: మంత్రి పువ్వాడ

ఖమ్మం, ముద్ర:  కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన , తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు అనారోగ్యం పరిస్థితుల దృష్ట్యా ఈనెల 19న తన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

అభిమానులు, కార్యకర్తలు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చీమలపాడు అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి అజయ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు మంత్రి చెప్పారు.