గుండే ఆపరేషన్ కోసం 2 లక్షల రూపాయల LOC లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

గుండే ఆపరేషన్ కోసం 2 లక్షల రూపాయల LOC లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తిమ్మజీపెట్ మండలంలోని గొరిట గ్రామానికి చెందిన శ్రీశైలం గారి కుమారుడు 8 ఏళ్ళ బాలుడు ధనుష్ కుమార్  గుండెకు చిన్న రంధ్రం ఏర్పడ్డది అని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ సూచించడంతో,వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపరేషన్ చేయించుకోలేదు,ఆ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి  దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి  హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డాక్టర్స్ తో మాట్లాడి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2,00,000 లక్షల రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి,ఈరోజు బాలుని కుటుంబ సభ్యులకు అందజేశారు,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురళీ పాల్గొన్నారు