ఐకెపి ఉద్యోగుల ధర్నా
![ఐకెపి ఉద్యోగుల ధర్నా](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645261568c00b.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఐకెపి విఓఏలు తమ సమస్యల సాధనకు చేస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని, సీసీ లుగా పదోన్నతులు కల్పించాలని, బీమా పథకం అమలు చేయాలని కోరుతూ వారు సమ్మె చేస్తున్నారు. ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ రాంబాబు కు వినతి పత్రాన్ని అందజేశారు.