ఏపీ, తెలంగాణ‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. షెడ్యూల్ ఇదే...!

ఏపీ, తెలంగాణ‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. షెడ్యూల్ ఇదే...!

ముద్ర,తెలంగాణ బ్యూరో:- లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల (మే) 8, 10 తేదీల్లో ఆయన తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరుకానున్నారు. ఇక 10వ తేదీన మహబూబ్‌నగర్‌‌తో పాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 3, 4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడల్లో మోదీ పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.