ఆకారంలో పాఠశాల గదులను ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఆకారంలో పాఠశాల గదులను ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక,ముద్ర:-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  మంగళవారం నాడు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మొక్కలు నాటి,మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మాణం చేసిన నూతన తరగతి గదులను, వంట గది, డైనింగ్ హల్,ల్యాబ్ మరియు ప్రాథమిక పాఠశాలలో రీడింగ్ రూమ్ లను ఆయన ప్రారంభించారు. పాఠశాలలో ర్యాంకులు  సాధించిన విద్యార్థులను ఎంపీ ఈ సందర్భంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.