వెంకటేశమును పరామర్శించిన ఎంపీ - మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచన

వెంకటేశమును పరామర్శించిన ఎంపీ - మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచన

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: బుడిగ సంఘం జిల్లా అధ్యక్షుడు వస్తం వెంకటేశంను  మెదక్  ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆక్సిడెంట్ అయి బ్రినోవ రిహాబీటేషన్ సెంటర్ కొండాపూర్ లో వెంకటేశం చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఎంపీ శుక్రవారంనాడు పరామర్శించి,అండగా ఉంటానని హామీ ఇచ్చారు.వెంకటేశం కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు. ఎంపీ వెంట ఆసుపత్రికి వెళ్లిన వారిలో కరిక శ్రీనివాస్ ఆశ యాదగిరి వనం రమేష్ తదితర దళిత గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు.