న్యాయం చేయాలని టవర్ ఎక్కిన వృద్ధుడు | Old Man Climbed Tower in Karimanagar Seeking Justice

న్యాయం చేయాలని టవర్ ఎక్కిన వృద్ధుడు | Old Man Climbed Tower in Karimanagar Seeking Justice

ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం లో పోలు మొండయ్య అనే వృద్ధుడు నాకు న్యాయం చేయాలని విద్యుత్ టవర్ ఎక్కిన వృద్ధుడు. అన్నదమ్ములకు సంబంధించిన భూ వివాదంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి న్యాయం చేస్తామని చెప్పి రోజులు నెలలు దాటవేయడంతో పెద్ద మనుషుల చుట్టూ తిరిగిన ఏలాంటి న్యాయం జరగకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం గ్రామ సమీపంలోని 33 కెవి విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చేరుకున్న పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో టవర్ దిగి రావడంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.