వలస పక్షులకు అవకాశం ఇవ్వవద్దు

వలస పక్షులకు అవకాశం ఇవ్వవద్దు

తాండూరులో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి మద్దతు తెలిపిన ప్రజలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: 40 ఏళ్లలో ఎవ్వరూ చేయని విధంగా కేవలం మీ బిడ్డ రోహిత్ రెడ్డి రెండేళ్లలోనే 16 వందల 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన ఘనత నాకే దక్కుతుందన్నారు. శుక్రవారం ఆయన తాండూరు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని.. ఒకప్పుడు తాండూరు ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది అన్నారు. తాండూరు అభివృద్ధే నా లక్ష్యమని.. మరోసారి ఆశీర్వదించండి ఇంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. కాంగ్రెస్ హామీలన్నీ గొంగ హామీలని.. బీఆర్ఎస్ మేనిఫెస్టో సంచలనం అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం మరెన్నే పథకాలను  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెడుతున్నారని.. బీఆర్ఎస్ తెనే అభివృద్ధి సాధ్యం అన్నారు. కాంగ్రెస్ విషయానికొస్తొ.. తాండూరులో సగం ఊర్ల పేర్లు తెలియనివారు ఏం అభివృద్ధి చేస్తారన్నారు. ఎప్పటికైనా ఇంటోడు ఇంటోడే..బయటోడు బయటోడే అన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలిచి తాండూరు సత్తా చాటుతా అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం అఫ్పుతో పాటు పలువురు కౌన్సిలర్లు, సీనియర్ లీడర్లు, యండ్ లీడర్లు ఉన్నారు.