పొన్నం ప్రభాకర్ రాజకీయ అజ్ఞాని

పొన్నం ప్రభాకర్ రాజకీయ అజ్ఞాని
  • బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయ అజ్ఞాని అని    బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు. మీరు విసిరిన సవాల్ కు మా గ్రామ అధ్యక్షుడు చాలంటూ ఎద్దేవా చేశారు. ఏ గ్రామం కు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గ్రామ శాఖ అధ్యక్షుడు వివరిస్తాడని వెల్లడించారు. తను ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు ఏం చేశాడో చెప్పకుండా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ పై సవాల్ విసిరడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసు అన్నారు. ఎంపీగా మీ హయాంలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయిన నువ్వు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసిఆర్ ది అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న స్మార్ట్ సిటీ సాధించిన ఘనత వినోద్ కుమార్ ది అన్న విషయం మర్చిపోవద్దు అన్నారు. 200 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్, 450 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటుతో కరీంనగర్ పర్యాటక కేంద్రంగా మారిందని వెల్లడించారు. అభివృద్ధిలో కరీంనగర్ దూసుకుపోతుందని స్పష్టం చేశారు. రైతుబంధు దళిత బంధు కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన అభివృద్ధిపై పుస్తకమే రాయొచ్చని వ్యాఖ్యానించారు. సవాల్ విసిరే ముందు తాము ఏం చేశామో గుర్తుంచుకోవాలని హితువు పలికారు. ఈ సమావేశంలో చీటీ రాజేందర్ రావు, తోట మధు తో పాటు పలువురు పాల్గొన్నారు.