‘రా’ చీఫ్గా రవి సిన్హా
న్యూఢిల్లీ: ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్గా 1988 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి రవి సిన్హాను నియమిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిన్హా ఇదివరలో మంత్రిమండలికి భద్రత కల్పించే సీనియర్ అధికారిగా పనిచేశారు. రా చీఫ్గా రవి సిన్హా రెండేళ్ళు పనిచేసేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రవి సిన్హా సమంత్ గోయల్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. గోయల్కార్యకాలం జూన్ 30వరకు ఉంది. గోయల్ పంజాబ్ కేడర్ ఐపీఎస్. సమంత్ గోయల్ ఆధ్వర్యంలోనే పాక్లోని బాలాకోట్లో ఎయిర్స్ర్టైక్స్ జరిగాయని కూడా పలువురు చెప్పుకుంటారు. 370 ఆర్టికల్ రద్దు కూడా సమంత్ గోయల్ ఆలోచనే అనే వాదనలున్నాయి. కాగా "రా" చీఫ్గా నియమితులైన రవి సిన్హా బిహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందినవారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో విద్యనభ్యసించారు. 1988లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. రవి సిన్హాకు ప్రభుత్వం మధ్యప్రదేశ్కేడర్ బాధ్యతలను అప్పజెప్పింది. అటల్బిహారీ వాజ్పేయి కాలంలో ఛత్తీస్ఘడ్లో తీసుకున్న పలు నిర్ణయాలలో రవి సిన్హా కూడా కీలక పాత్ర వహించినట్లు చెప్పుకుంటారు.ఈయన ప్రస్తుతం కేబినెట్లో పీఎస్వో పదవిలో ఉన్నారు. రాచీఫ్ పదవీ బాధ్యతలను రవి సిన్హా జూన్ 30న చేపట్టనున్నారు.