కేంద్రంలో ఉన్నవారు దేశం కోసం పనిచేయడంలేదు: నితీశ్ కుమార్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్. విపక్షాల ఐక్యత కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకుంటున్న నితీశ్, తేజస్వీ. కేంద్రంలో ఉన్నవారు దేశం కోసం పనిచేయడంలేదని నితీశ్ కుమార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజకీ య పార్టీలు ఏకమై, కలిసి పనిచేయాలన్నారు.