రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్ : రోడ్డు ప్రమాదంలో మెదక్ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. హవేలి ఘనపూర్ మండలం నాగపూర్ కు చెందిన చాకలి అంజయ్య(52) సోమవారం రాత్రి విధులు నిర్వహించి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో హవేలి ఘనాపూర్ టీ పాయింట్ వద్ద సర్దనకు చెందిన ఇద్దరు యువకులు బైక్ తో ఎదురుగా వచ్చి అంజయ్యను ఢీ కొట్టారు. దీంతో కండక్టర్ అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.