అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

ముద్ర, మహేశ్వరం : ఆర్ కె పురం డివిజన్ అల్కాపురి రోడ్ నెంబర్-18 (మసీద్ ఎదురుగా) యూజీడి పైప్,  ఈస్ట్ యాదవ నగర్ లలో 40 లక్షలతో చేపట్టే డ్రైనేజీ ఆర్ సీ సీ లైన్ అభివృద్ధి  పనులకు శనివారం  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేసారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఈస్ట్ యాదవ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  కేవలం వర్షపు నీరు పోయేలా నాళాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని,మహేశ్వరం నియోజకవర్గంలో 130 కోట్లతో నాళాల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని తెలిపారు.స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించటానికి కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీలు దయనంద్ గుప్తా, యెగ్గే మల్లేశం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పెద్ద ఎత్తున కాలనీ ప్రజలు పాల్గొన్నారు.