12న ఇసుక వేలం

12న ఇసుక వేలం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈనెల 12న ఉదయం 11 గంటలకు సీజ్ చేసిన ఇసుక వేలం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.5 వేల డిడి చెల్లించాలని సూచించారు. డిసెంబర్ 30, ఈనెల 9న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు కలిసి మొత్తం 140 మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేయడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు.