అల్లదుర్గంలో నిరుద్యోగులకు జాబ్ మేళా

అల్లదుర్గంలో నిరుద్యోగులకు జాబ్ మేళా

పెద్ద శంకరం పేట, ముద్ర:
నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అల్లాదుర్గం నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం తెలిపారు. అల్లాదుర్గం ఐబి చౌరస్తా సమీపంలోని శ్రీవాణి విద్యాలయంలో  ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ యువకులు. రిటైర్డ్ ఉద్యోగులు. గృహిణిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి ఆధునిక యుగంలో ఖర్చులు పెరిగిపోయి. ఉపాధి లేక, ఉద్యోగాలురాక నిరుద్యోగులు సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, ప్రైవేట్ రంగంలో కూడా ప్రతిభ కనబరిచి ఆర్థికంగా ఎదగవచ్చన్నారు.    నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు