పోచారం ప్రాజెక్ట్ వద్ద పర్యాటక అభివృద్ధికి భూమి సర్వే

పోచారం ప్రాజెక్ట్ వద్ద పర్యాటక అభివృద్ధికి భూమి సర్వే
Land survey for tourism Development at Pocharam project

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్- కామారెడ్డి జిల్లా సరిహద్దులో గల పోచారం ప్రాజెక్ట్ వద్ద పర్యాటక అభివృద్ధి కోసం 30 ఎకరాల స్థలం అవసరం ఉన్నందున రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. హవేలి ఘనపూర్ మండల తహసీల్దార్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సర్వేయర్లు దుర్గాభవాని తదితరులు సర్వే చేపట్టారు. ఇక్కడ సరిహద్దులు కూడా నిర్దారణ చేయాల్సిన అవసరం ఉంది.