జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి
  • ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఈ నెల 2 నుండి 9 వరకు జిల్లా  కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్.పి. పి.రోహిణి ప్రియదర్శిని తెలిపారు.శుక్రవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో  మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలత్ లో  సామరస్య ధోరణితో రాజీ పడదగిన వివిధ కేసులపై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి రాజీ మార్గం రాజ మార్గమని వారికి అర్థమయ్యే విధంగా తెలపాలని జిల్లా సిబ్బందికి  సూచించారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడెలా ప్రతి కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్, కోర్ట్ కానిస్టేబుళ్లు, సిబ్బంది  కృషి చేయాలని తెలిపారు.  న్యాయశాఖ అధికారులతో  సమన్వయంతో  విధులు నిర్వహించాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ లో సాధ్యమైనంతవరకు ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ కుదిరేలా చూడాలన్నారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి రాజీ కాదగ్గ కేసులలో రాజీ  శాతం పెంచాలని  సూచించారు.  ఈ రాజీ కేసులు మెదక్ పట్టణంలోని 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జ్ కోర్ట్ ఆవరణలో ఈ నెల 2 నుండి 9 వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహింపబడుతుందన్నారు.