యువత క్రిడల పట్ల మక్కువ చూపాలి

యువత క్రిడల పట్ల మక్కువ చూపాలి

తూప్రాన్ :ముద్ర: యువత క్రిడల పట్ల మక్కువ చూపాలని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సిఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో అయన పాల్గొని పోటీలలో విజయం సాధించిన వారికీ బహుమతులు అందచేశారు.

అనంతరం తూప్రాన్ లో సిఎం కప్ పోటీలలో విజేతలకు గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహిపాల్ రెడ్డి, పాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, నాయకులు చంద్రశేఖర్, భగవాన్ రెడ్డి, దర్మేందర్, జావీద్, రాహుల్ రెడ్డి, ప్రత్యేక అధికారి కృష్ణమూర్తి, ఎంపీడీఓ లు యాదగిరి రెడ్డి, అరుంధతి, ఎమ్మార్వో బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.