శాలిపేటలో అగ్నిప్రమాదం...వస్తువులు, 50 వేల నగదు దగ్ధం...

శాలిపేటలో అగ్నిప్రమాదం...వస్తువులు, 50 వేల నగదు దగ్ధం...

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రమాదవశాత్తు నివాస పూరిగుడిసె దగ్ధమైన సంఘటన హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్ల సిద్దిరాములు నివాస పూరిల్లు కరెంటు షాక్ తో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 50వేల రూపాయలు బియ్యం, ఇంటి సామాగ్రి, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మెదక్ నుండి అగ్నిమాపక శకటం వెళ్లి  సిబ్బంది మంటలు ఆర్పారు. విషయం తెలిసిన వెంటనే హవేలి ఘనపూర్ తహసిల్దార్ నవీన్ కుమార్ చేరుకొని బాధితులను పరామర్శించారు. వివరాలు సేకరించారు. తక్షణ సాయం కింద వంట సామాగ్రీ, సరుకులు అందజేశారు. వెంట సర్పంచ్ మన్నే లక్ష్మీనారాయణ తదితరులున్నారు.