కనువిందు చేస్తున్న జలపాతాలు..

వెంకటాపురం(నూ), ముద్ర:ములుగు జిల్లాలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జలపాతాలు జలకలను సంతరించుకుంటున్నాయి. జలపాతాలు కలకలలాడుతుండడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో జలపాతాలు కనువిందు చేస్తుండడంతో ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.జలపాతాలను చూసి పులకించి పోయారు. వర్షాలు లేక బోసిపోయిన జలాశయాలు ఇప్పడిప్పుడే జల కలను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.