సూడాన్​లో చిక్కుకున్న తెలంగాణవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

సూడాన్​లో చిక్కుకున్న తెలంగాణవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

సూడాన్​లో చిక్కుకున్న తెలంగాణవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సూడాన్​ నుంచి భారత్​కు తరలిస్తున్నవారిలో తెలంగాణవాసులు ఉంటే టీఎస్​ సర్కారు సాయం చేస్తుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. తెలంగాణవాసుల వివరాల కోసం విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ గౌరవ్​ ఉప్పల్​ చెప్పారు. ఈ రోజు సూడాన్​ నుంచి వచ్చేవారిలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఢిల్లీ వచ్చినవారిని హైదరాబాద్​కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.