గౌరవెల్లి ప్రాజెక్టులో ట్రయల్ రన్ సక్సెస్

గౌరవెల్లి ప్రాజెక్టులో ట్రయల్ రన్ సక్సెస్
  •  ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే దంపతులు
  •  త్వరలో లక్ష మందితో భారీ బహిరంగ సభ
  •  త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రజలకు అంకితం 

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చానని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ బాబు చెప్పారు. గురువారం నాడు హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులోకి ఆయన నీటిని ట్రయల్ రన్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన సతీమణి డాక్టర్ షమీతతో కలిసి ప్రాజెక్టు లోకి వచ్చిన నీటికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా ఎడారిగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో పాటు చుట్టుపక్కల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రాజెక్టు వద్దకు తెచ్చి లక్షమంది ప్రజల సమక్షంలో ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమ కొండ జెడ్పి చైర్మన్ సునీల్ కుమార్ సిద్దిపేట జెడ్పి వైస్ చైర్మన్ రాజిరెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు శంకర్, రాములు నాయక్, ఎంపీపీలు, జడ్పిటిసిలు సర్పంచులు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.