తిరుగులేని శక్తి బిఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

తిరుగులేని శక్తి బిఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

మెదక్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెదక్ శాసనసభ్యురాలు,బీఆర్ స్ పార్టీ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డిని సోమవారం ఇటీవల బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్  సమక్షంలో చేరిన తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఏకే.గంగాధర రావు  నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భం పద్మా దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్  చేస్తున్న  సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో రైతుల  అభ్యున్నతికి, అన్ని రంగాలలో ప్రగతి పధంలో  ముందుకెళ్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్  పాలన నచ్చి అన్ని వర్గాల ప్రజలు, నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పూర్వపు రామాయంపేట, మెదక్ నియోజకవర్గంలో మంచి పేరు ఉన్న సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఏకే.గంగాధర రావు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో  ముందుకు వెళ్తానని చెప్పారు.  మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, గవ్వలపల్లి ఉప సర్పంచ్ రామిరెడ్డి, ఏకే.రమేష్ చందర్ ఉన్నారు.