శ్రీ స్వామివారి ఆలయంలో  శతఘటభిషేకం

శ్రీ స్వామివారి ఆలయంలో  శతఘటభిషేకం

ముద్ర ప్రతినిధి భువనగిరి : శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం ఆలయంలో శతఘటభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లన్ తీగల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీ స్వామి అమ్మ వార్ల కు వెండి జోడు సేవ నిర్వహించారు. 


 స్వామివారి దర్శించుకున్న ఐపీఎస్
శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ ఐపీఎస్ ఐజిపి రమేష్ రెడ్డి కుటుంబ సమేతముగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీ స్వామి వారి ప్రసాదంను ఆలయ కార్యనిర్వాహణాధికారి ఏ. భాస్కరరావు  అందజేశారు.