సందర్శక యాత్రను ప్రారంభించిన కలెక్టర్

సందర్శక యాత్రను ప్రారంభించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సందర్శక యాత్రను ఏర్పాటు చేశారు . బాసర సందర్శక యాత్రకు  శనివారం నిర్మల్ నుండి బయలుదేరిన బస్సును కలెక్టర్ వరుణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో 45 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు  పాల్గొన్నారు. బాసర సరస్వతీ దేవి ఆలయం తో పాటు ట్రిపుల్ ఐటీని కూడా సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ రవీందర్ రెడ్డి  సఫియా ఖాన్,  డిఎస్ఓ వినోద్ కుమార్, ఎస్ఆర్పి నారాయణ వర్మ, ప్రిన్సిపాల్ మోహన్, వినోద్ ఉపాధ్యాయులు లీలారాణి, సంజీవ్, రాథోడ్ ప్రేమలత పాల్గొన్నారు.