మద్యం ప్రియులను నిరాశ పరుస్తున్న నిర్వాహకులు

మద్యం ప్రియులను నిరాశ పరుస్తున్న నిర్వాహకులు

ఆలేరు, ముద్ర : ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు వేసవికాలంలో అధికంగా బీర్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని పలు మద్యం షాపులలో నో స్టాక్ (బీర్లు) అని దర్శనం ఇవ్వడంతో మద్యం ప్రియులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు, ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు స్పందించి, అన్ని మద్యం దుకాణాలలో బీర్లను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.