ప్రజా సంక్షేమం... కాంగ్రెస్తోనే సాధ్యం

ప్రజా సంక్షేమం... కాంగ్రెస్తోనే సాధ్యం
  • కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుంది
  • గత ఎనిమిదేళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజలు
  • తెలంగాణ ప్రజలనుమోసం చేసిన కేసీఆర్: టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టిపిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు సమక్షంలో గురువారంకాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంత కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని  అన్నారు. కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పార్టీ బలోపేతానికి  కార్యకర్తలు కృషి చేయాలని  అన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె బి శౌరి, టిపిసిసి సభ్యులు ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు మాళోత్ రాందాస్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణ్ రావు, చుంచుపల్లి మండల అధ్యక్షుడు పెగడ బిక్షపతి, గరీభ్ పేట ఎంపిటిసి కసనబోయిన భద్రం, మైనారిటీ సెల్ నాయకులు గౌస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దావుద్, షబానా, జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీర సురేష్, కొమరయ్య, దుర్గ, భట్టు మురళి, వెంకట్, తదితరులు  పాల్గొన్నారు.