రెడ్డి కమ్యూనిటీ హాల్ కి 10 లక్షలు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

రెడ్డి కమ్యూనిటీ హాల్ కి 10 లక్షలు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధి 15వ వార్డులో రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సిడిపి) నుండి 10 లక్షల రూపాయలను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను   సంబంధిత వార్డు రెడ్డి సంఘం నాయకులకు ఎమ్మెల్సీ అందించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు ఎమ్మెల్సీకి ఆత్మీయ సన్మానం గావించి, తమ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రెడ్డి సంఘం నాయకులు రెడ్డిమల్లి సిద్దిరెడ్డి, సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, కిషన్ రెడ్డి, సందీప్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు విట్టల్ గౌడ్, పెరికె కిషన్, కుమ్మరి గోపాల్ తదితరులు ఉన్నారు.