15 ట్రాక్టర్ల వరిగడ్డి, బుడ్డ పొట్టు వాముల దగ్ధం లక్ష రూపాయల ఆస్తి నష్టం

15 ట్రాక్టర్ల వరిగడ్డి, బుడ్డ పొట్టు వాముల దగ్ధం లక్ష రూపాయల ఆస్తి నష్టం

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లా పానుగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన తలకంటి రవీందర్ రెడ్డి కి చెందిన 15 ట్రాక్టర్ల వరిగడ్డి, బుడ్డ పొట్టు వాము ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన ఇంటి సమీపంలో ఖాళీ స్థలంలో పశువుల మేపు కోసం గడ్డి, పొట్టు వాములను వుంచగ ప్రమాదవశాతు నిప్పు అంటుకుని దగ్ధమైందన్నారు. దీంతో సుమారుగా లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.

విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగన్న వనపర్తి ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ తో మంటలను అర్పించారు. సంఘటన స్థలానికి  ఎస్ఐ నాగన్న , పోలీస్ సిబ్బంది తో  చేరుకొని మంటలను ఆర్పేందుకు ఫైర్ స్టేషన్ సిబ్బందికి సహకరించారు. ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు.