థాయ్లాండ్ గాంబ్లింగ్ కేసులో 99 మంది అరెస్టు
థాయ్లాండ్ గాంబ్లింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. 99 మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయినవారిలో ప్రముఖులు ఉన్నారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అరెస్టయ్యారు. వ్యాపారులు సాగర్, సుదర్శన్ రెడ్డి, భరత్ రెడ్డి, మల్లికార్జునరావు, బిల్డర్ మధు, మాధవరెడ్డి, వర్మ, తిరుమల్ రావు, బొమ్మిడి మధుసూదన్ను అరెస్టు చేశారు. ఏప్రిల్లో రెడుసార్లు ధాయ్లాండ్లో గాంబ్లింగ్ నిర్వహించిన చీకోటి ప్రవీణ్. ఏప్రిల్ 11 నుంచి 16 వరకు గాంబ్లింగ్ నిర్వహణ సాగింది. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రెండోసారి గాంబ్లింగ్ జరిగింది. థాయ్లాండ్ ఇంటలిజెన్స్కు సమాచారం ఇచ్చిన గోవాకు చెందిన వ్యక్తి. పక్కా సమాచారంతో హోటల్పై థాయ్ పోలీసులు దాడి చేశారు.