మూడవ రోజు ఒక నామినేషన్ దాఖలు

మూడవ రోజు ఒక నామినేషన్ దాఖలు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధర్మ సమాజ్ పార్టీ(డి.ఎస్.పి) అభ్యర్థిగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కొట్టే ఏసోబు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సోమవారం నాటికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బొల్లెపల్లి రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా మారపాక రమేష్ (రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా), కొట్టే ఏసోబు( ధర్మ సమాజ్ పార్టీ) అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.