ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ముద్ర, తూప్రాన్:-చేపల వేటకు వెల్లి ప్రమాదవ శాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మనోహరాబాద్ మండల కేంద్రం లో చోటుచేసుకుంది. ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన గాలి ముత్యాలు (46) మండల కేంద్రం మనోహరాబాద్ లో పని చేసుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం రూమ్ నుండి బయటకు వెల్లగా సోమవారం ఉదయం స్థానిక ఎల్లమ్మ చెరువు లో పడి ఉండటం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా చేపల వేటకు వెల్లి ప్రమాదవ శాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు గుర్తించారు.మృతుడి భార్య లత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.