దాణా వాహనం ఢీ: వ్యక్తి మృతి
ముద్ర ప్రతినిధి, మెదక్:దాణ వాహనం ఢీకొని బైక్ అదుపు తప్పడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మెదక్- కామారెడ్డి జిల్లా సరిహద్దులో గల పోచంరాల్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... మండల కేంద్రం హవేలీ ఘణాపూర్ కు చెందిన నల్ల రవి (30) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో వల్ల అత్తగారిల్లు దేవునిపల్లి నుండి బైక్ పై కూతురు వర్షతో కలిసి వస్తుండగా కోళ్ళ దాణాకు సంబంధించిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మిగుతున్నాడు. భార్య సువర్ణ, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.