పూర్వపు విద్యార్ధుల సమ్మేళనం

పూర్వపు విద్యార్ధుల సమ్మేళనం

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లోని ఎస్ ఆర్ గార్డెన్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూరు 2004-2005 10వ తరగతి బ్యాచ్ కి చెందిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

18 సంవత్సరాల అనంతరం కలుసుకున్న సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆనాడు ఉపాధ్యాయుల దండన, అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ క్రమశిక్షణలతో కూడిన విద్య చెప్పడం వల్ల తాము ఉన్నత స్థానాలకు చేరుకున్నామని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా తమ ఉపాధ్యాయులతో తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోని ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు . ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.