ఘనంగా ప్రవక్త శాంతి ర్యాలీ

ఘనంగా ప్రవక్త శాంతి ర్యాలీ

మహాదేవపూర్, ముద్ర: మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా మదీనా మస్జిద్ ఆధ్వర్యంలో ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు ఎండి ఎజాస్ ఆధ్వర్యంలో మదీనా మస్జిద్ నుండి వందల ముస్లింలు ప్రవక్త సందేశాలను ఆలపిస్తూ శాంతి ర్యాలీని ప్రారంభించారు. ఇమామ్ మర్ఖుద్ మాట్లాడుతూ ప్రవక్త కేవలం ముస్లింలకే కాకుండా విశ్వానికి శాంతి సందేశం అందించారని పేర్కొన్నారు.

మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా మహమ్మద్ ప్రవక్త శాంతి ప్రబోధ గీతాలను ఆలపిస్తూ ఊరేగింపును నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో ఇమామ్ మర్ఖుబ్ ఆలం, మసీదు కమిటీ అధ్యక్షులు ఎండి షాహెద్, కార్యదర్శి మిన్నుభాయ్ లతోపాటు జిల్లా పరిషత్ సభ్యురాలు గుడాల అరుణ, మండల పరిషత్ అధ్యక్షురాలు రాణిబాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, పలిమెల సబ్ ఇన్స్పెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న యువతకు, ప్రముఖులకు అధ్యక్షుడు ఏజాజ్ కృతజ్ఞతలు తెలిపారు.