62 మంది సభ్యులతో నూతన కమిటీ నియామకం...

62 మంది సభ్యులతో నూతన కమిటీ నియామకం...
  • దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరం పాటు పడదాం...
  • ఏకకంఠంతో గ్రామస్తుల ప్రతిజ్ఞ

కోదాడ, ముద్ర:అనతి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని, అశేష జనాదరణ పొందుతున్న దేవాలయం సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని యర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం... ఈ సందర్భంగా దేవాలయాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిందుకు ఆదివారం గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని పాత కమిటీతోపాటు, కొత్త కమిటీ 62 మంది సభ్యులతో కలిపి కమిటీని గ్రామ సర్పంచ్ వీరేపల్లి సుబ్బారావు, మాజీ సర్పంచ్ భాష బాయిన భాస్కరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలజాల జగన్నాథం ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు.