ఎల్లలు దాటిన తెలంగాణ చిత్రకళ

ఎల్లలు దాటిన తెలంగాణ చిత్రకళ
  • న్యూయార్క్​ లో చిత్రకళ ప్రదర్శన
  • కనువిందు చేస్తోన్న ప్రముఖ ఆర్టిస్టుల చిత్రాలు
  • ఏలే లక్ష్మణ్​, ఏలే ప్రియాంక

న్యూయార్క్​, ముద్ర: తెలంగాణ చిత్రకళ ఎల్లలు దాటింది. ఈ నెల 4నుంచి 7వరకు న్యూయార్క్​ లో  ప్రదర్శన జరుగుతుంది అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్​, ఆయన కూతురు ప్రియాంక వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన, చూసేందుకు వచ్చిన వారందరూ తండ్రి, తనయ వేసిన బొమ్మలను చూసి ఔరా అంటున్నారు. విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆయా చిత్రాలను చూసి కితాబిస్తున్నారు.