బీజీపీని బలోపేతం చేయాలి డాక్టర్ మురళీధర్

బీజీపీని బలోపేతం చేయాలి డాక్టర్ మురళీధర్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజీపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని హనుమకొండ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ మురళీధర్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో సోమవారం నియోజకవర్గ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో బీజీపీని బలోపేతం చేసే ప్రక్రియలో అధిష్టానం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు.

రానున్న రోజులలో గ్రామ గ్రామాన బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ పాలనలోని ఇబ్బందులు వివరించాలన్నారు. నియోజకవర్గ ప్రభారి వేముల అశోక్, పాలక్ వట్టిపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ విస్తారక్ వెంపటి రఘురాం, కో కన్వీనర్ గురిజాల వీరన్న, కోఆర్డినేటర్ కావటి ముత్యాలు, పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ యువ మోర్చా నాయకులు రడపాక ప్రవీణ్ నియోజకవర్గ నాయకులు బొజ్జపల్లి సుభాష్, మాదాసు వెంకటేష్, పుండ్రు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.