బిజెపి లోనే కొనసాగుతా

బిజెపి లోనే కొనసాగుతా
  • ఆరోపణలు అవాస్తవం
  • బిజెపి రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: టికెట్ రాకున్నా పార్టీలో కొనసాగుతానని, మా పార్టీ అభ్యర్థి వద్ద డబ్బులు ఆశించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బిజెపి రాష్ట్ర నాయకుడు పెరుమాళ్లా వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిలుపు రాలేదని బిజెపి అధిష్టాన పిలుపుమేరకు పని చేస్తా అన్నారు. పార్టీ విజయం కోసం కలిసి పని చేస్తాము అంటే అభ్యర్థి నుండి కనీసం పలకరింపు లేదన్నారు. సమావేశంలో  గాదెపాక శ్రీను, వంగ వేణు, నల్ల సతీష్ రెడ్డి, పల్లె నాగరాజు, వంగ నాగరాజు ఉన్నారు.