పేదల కల నిజం చేసిన  కేసీఆర్

పేదల కల నిజం చేసిన  కేసీఆర్
  • బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:పేదల సొంతింటి కల నిజం చేసింది సీఎం కెసిఆర్ అని మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ పట్టణం 12వ వార్డు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ అందించాలనే ఆశయంతో డబుల్ బెడ్ రూములు అందించారని తెలిపారు.

మరింత అభివృద్ధి జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.బీఆర్ఎస్‌లో చేరికకాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి భర్త అమృత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి నాయకులు ఆర్కే శ్రీనివాస్, మేడి మధుసూదన్ రావు, ప్రభురెడ్డి, మధు, బొద్దుల కృష్ణ, మాయా మల్లేశం, తొడుపునూరు శివరామకృష్ణ, కొండా శ్రీనివాస్, మేడిశెట్టి శంకర్, చింతల నర్సింలు, ఒమర్, లింగారెడ్డి, మ్యాకల మల్లేశం, చందు తదితరులు పాల్గొన్నారు.