ఎమ్మెల్యే మర్రి కి ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

ఎమ్మెల్యే మర్రి కి ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముచ్చటగా మూడోసారి నాగర్ కర్నూల్ నియోజికవర్గ బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కెసీఆర్  ఎమ్మెల్యే  మర్రి కి మరోసారి ఆశీర్వదించి టికెట్ ప్రకటించడంతో నాగర్ కర్నూల్ కు విచ్చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నియోజకవర్గ ముఖద్వారం తిమ్మాజి పేట మండలంలోని మరికల్ గ్రామం దగ్గర ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ఈ సందర్భంగా అక్కడి నుండి భారీ కార్ల ర్యాలీతో బయలుదేరి బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం అక్కడి నుండి పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి భారీ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికిన పట్టణ పార్టీ శ్రేణులు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కు  భారీ గజమాలతో సత్కరించారు, రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి లక్ష మెజారిటీతో గెలిపిస్తామని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.