చిరు వ్యాపారులకు బిఆర్ఎస్ పార్టీ గొడుగులు

చిరు వ్యాపారులకు బిఆర్ఎస్ పార్టీ గొడుగులు

మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరంలో  చిరు వ్యాపారస్తులకు గొడుగులను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. మంథని విఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు గొడుగులను చిరు వ్యాపారులకు అందించాలని తలపెట్టడం పట్ల పలువురు విఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాళేశ్వర గ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, ఎంపీటీసీ రేవెల్లి మమత టిఆర్ఎస్ నాయకులు వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, రేపు వెళ్లి నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు నగునూరి రమేష్ గౌడ్, మహిళ అధ్యక్షురాలు రేవెల్లి జ్యోతి, కాళేశ్వరము దేవస్థానం ధర్మకర్త కామిడి రాంరెడ్డి,  మాజీ ధర్మకర్త కొండ్ర ఓగేష్ గౌడ్, మండల మైనార్టీ సెల్  ఉపాధ్యక్షులు ఇమ్రాన్, మేకల సురేష్, రేవెల్లి రాకేష్, రేవెల్లి సతీష్ బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.