టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా

టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా

ముద్ర, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీడీడీ) చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టు నెలలో ఆయన టీడీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించమని కోరుతూ ఆయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డికి ఒక లేఖను పంపించారు.