కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి

కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి
  • డోర్నకల్ లో బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తా!
  • పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి భూపాల్ నాయక్ విజ్ఞప్తి

కేసముద్రం, ముద్ర: డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి.. సిట్టింగ్ బీఆర్ఎస్ కు చుక్కలు చూపించి ఆ పార్టీ అభ్యర్థి డి.ఎస్ రెడ్యా నాయక్ ను ఓడించి కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరేస్తానని కిసాన్ పరివార్ అధినేత, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహుడు నానావత్ భూపాల్ నాయక్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, రైతులకు, విద్యార్థులకు, యువకులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తున్నానని, సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు ఈసారి డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డోర్నకల్ సమగ్ర అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని, ఇప్పటికే అన్ని వర్గాల వారితో మమేకమయ్యానని, అన్ని వర్గాలకు సంబంధించిన వారి ఇబ్బందులను గుర్తించానని, మెజారిటీ ప్రజలు కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని రేవంత్ రెడ్డికి భూపాల్ నాయక్ వివరించారు. భూపాల్ నాయక్ వెంట రంగన్న గౌడ్ , డి.వై గిరి , గాంధీ నాయక్ అచ్యుతరావు, శివన్న తదితరులు ఉన్నారు.