మేడ్చల్ లో బీ ఆర్ ఎస్ కు బారీ షాక్....

మేడ్చల్ లో బీ ఆర్ ఎస్ కు బారీ షాక్....
  • మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జడ్ పీ ఛైర్మెన్ శరత్ చంద్ర రెడ్డి లు కాంగ్రెస్ లో చేరిక...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:మేడ్చల్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే పలిపెద్ధి సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ మలిపెద్ధి శరత్ చంద్ర రెడ్డి లు తమ అనుచరులతో కలిసి బుదవారం బీ ఆర్ ఎస్ పార్టీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పీ సీ సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన మంత్రి మల్లారెడ్డిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని అన్నారు. కొడంగల్ లో ఓడిపోయిన నన్ను మల్కాజ్ గిరి పార్లమెంటు ప్రజలు కడుపులో పెట్టుకుని ఎంపీ గా గెలిపించారని, వారికి జీవి తాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపిస్తే మేడ్చల్ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గం లోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో కాంగ్రెస్ జెండా ఎగుర  వేస్తామని ధీమా వ్యక్తంచేశారు. టికెట్ రాని వారు నన్ను తిట్టినా కుటుంబ పెద్దగా వాళ్ల బాధను అర్థం చేసుకుంటున్నాను. వారికి భవిషత్ లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్, ఉప్పల్ నియోజక వర్గాల అభ్యర్తులు తోట కూర వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.