భట్టి విక్రమార్క యాత్రకు బ్రేక్

భట్టి విక్రమార్క యాత్రకు బ్రేక్

ముద్ర ప్రతినిధి, మహబూబ్​ నగర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రెండు రోజులపాటు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలలో కిలోమీటర్ల కొద్ది పాదయాత్ర చేపట్టిన భట్టి బుధవారం రాత్రి అస్వస్థకు గురయ్యారు. ఆయనను పరిశీలించిన డాక్టర్ వినోద్ కుమార్ బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గాయని చెప్పారు. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. దీంతో 19, 20 తేదీల్లో మహబూబ్​ నగర్ జిల్లాలో నిర్వహించే పాదయాత్రకు బ్రేక్ పడింది.