వెలిశాలలో ఓటు వేసిన మావోయిస్టు ఆగ్రనేత తమ్ముడు..

వెలిశాలలో ఓటు వేసిన మావోయిస్టు ఆగ్రనేత తమ్ముడు..

ముద్ర ప్రతినిధి  జయశంకర్ భూపాలపల్లి:మావోయిస్టు పార్టీ అగ్రనేత, చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ తమ్ముడు మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, ఆయన సతీమణి గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన అశోక్ అలియాస్ ఐతు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతి లో కలిసిపోయిన విషయం తెలిసిందే కాగా అశోక్ కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ అధిష్టానం గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అయితే మాజీ మావోయిస్టు నేత అశోక్ దంపతులు స్వగ్రామమైన వెలిశాలలో ఓటుహక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.