వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10 విచారణకు రావాలంటూ ఆదేశించింది. 10న కచ్చితంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసిన సీబీఐ. ఆదివారం రాత్రి పులివెందులలో అవినాష్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సీబీఐ. హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో విచారణకు రావాలంటూ ఆదేశం. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని భాస్కర రెడ్డికి నోటీసులు. ఇప్పటికే అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ.