ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు మంతనాలు

ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు మంతనాలు

ముద్ర,హైదరాబాద్:-ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మరోసారి భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో వీరిద్దరూ సుమారు 4 గంటల పాటు సమావేశమైనట్లు సమాచారం. మిగతా అభ్యర్థుల జాబితా, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.